పాట్నా : బిహార్లోని బక్సర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. ప్రాథమిక పాఠశాలలో విద్యుత్ షాక్ కారణంగా ఓ చిన్నారి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బక్స్ జిల్లా ఇటాడి బ్లాక్లోని నాథ్పూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం రోడ్డుపై భైఠాయించారు.
వివరాల్లోకి వెళితే.. నాథ్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేసేందుకు ఇనుప పైపును అమర్చారు. వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు వందకుపైగా విద్యార్థులకు పాఠశాలకు వచ్చారు. జెండా ఎగుర వేస్తున్న తరుణంలో.. ఇనుప పైపుపై ప్రమాదవశాత్తు హైవోల్టోజీ విద్యుత్ వైర్ పడింది. పైపుకు కరెంటు ప్రసరించగా.. అక్కడున్న నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐదో తరగతి చదువుతున్న శుభంకుమార్ అనే విద్యార్థి మృతి చెందగా.. ముగ్గురు చికిత్స పొందుతున్నారు.