జెనీవా, మార్చి 19: వాతావరణ మార్పులపై ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేడి 2023 సంవత్సరంలో రికాైర్డెందని, 2024లో ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. గతంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రత జనవరిలో నమోదైందని తెలిపింది. ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ైక్లెమెట్’ పేరుతో ఈ సంస్థ మంగళవారం వార్షిక నివేదికను విడుదల చేసింది.
గత ఏడాది రికార్డు స్థాయిలో గ్రీన్హౌస్ వాయువులు, భూమి, నీటి ఉష్ణోగ్రతలు పెరిగాయని, మంచుపర్వతాలు, సముద్రపు మంచు గరిష్ఠ స్థాయిలో కరిగిపోయిందని ఈ నివేదిక పేర్కొన్నది. భూతాపం పెరుగుదల పారిశ్రామీకరణకు ముందు కంటే 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలని చేసుకున్న పారిస్ ఒప్పంద లక్ష్యం ప్రమాదంలో ఉందని తెలిపింది. 2023 నుంచి 2024 మధ్య 12 నెలల కాలంలో భూతాపం పెరుగుదల సగటున 1.56 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ… భూగ్రహం ప్రమాదపుటంచున ఉన్నదని ఈ నివేదిక చెప్తున్నదనిపేర్కొన్నారు.
ప్రపంచ కాలుష్య రాజధానిగా ఢిల్లీ!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరాల్లో ఢిల్లీ మళ్లీ టాప్లో నిలిచింది. కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో బీహార్లోని బెగుసరాయ్ మొదటి స్థానంలో ఉన్నది. స్విస్ సంస్థ ఎయిర్ క్వాలిటీ నివేదిక-2023 ప్రకారం.. వాయుకాలుష్యానికి సంబంధించి 134 దేశాల్లో భారతదేశం మూడోస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉన్నది.