బెంగళూరు: కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో క్షయ వ్యాధి ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసింది. కర్ణాటకలో ఇలాంటి కేసులను 25 వరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులందరికీ టీబీ స్క్రీనింగ్ నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే చికిత్స అందించవచ్చని అన్నారు. కరోనా, టీబీ రెండు కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయని చెప్పారు.
మరోవైపు రక్తం, అవయవ దానానికి కరోనా ఆటంకం కలిగిస్తున్నదని ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.