జైపూర్, జూన్ 4: రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మెహతా కూడా అదే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వీరిద్దరు భార్యాభర్తలు.
దీంతో రాజస్థాన్ హైకోర్టులో భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేసిన రికార్డు వీరి సొంతం కానుంది.