ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఇరుకైన ప్రదేశాల్లో క్షతగాత్రులను గుర్తించడం కష్టం.
ఈ నేపథ్యంలో చైనాలోని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రోబో ఎలుకలను తయారుచేస్తున్నారు. క్షతగాత్రులను సులభంగా, వేగంగా గుర్తించడంలో ఇవి దోహదపడుతాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికే నమూనా రోబో ఎలుకను తయారు చేశారు. దాని పేరు స్క్యూరో.