వనపర్తి టౌన్, జూన్ 8 : రవాణారంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తి బస్టాండ్ ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ పెట్రోల్ ధరలు పెంచేందుకోసమే డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతుందని, అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు రూ.50 ధర ఉండేదని, నేడు ఒక బ్యారె ల్ ధర రూ.70 క్రూడాయిల్ ఉంటే రూ.100 పెట్రోల్ ధర ఉంటుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ అనుచరులైన ముకేష్ అంబాని ఆస్తులు పెంచడం తప్పా వేరే ఆలోచన లేదని అన్నారు. ఆదాయపన్ను పరిధిలోకి రాని అన్ని రంగాల కార్మికులందరికీ నెలకు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాములు, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎం.డీ ఖలీల్, వెంకటేశ్, బాలు, సమంత్, అనిల్ ఉన్నారు.
రోడ్ ట్యాక్సీలను ఎత్తివేయాలి
ప్రైవేట్ వాహనాలకు టోల్, రోడ్ ట్యాక్సీలను ఎత్తివేసి ఇన్సూరెన్స్ చార్జిలను తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలో లారీ,ఆటో, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా నిక్సన్ మాట్లాడు తూ కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లకు, కార్మికులకు రూ. 7500 ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి 10 కిలోల బియ్యంతో పాటు 19 రకాల సరుకులను ఆరునెలల పాటు ఉచితంగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో రవి, సయ్యద్, బషీర్, రవి, ఎండీ. ఆసీఫ్, జతేందర్గౌడ్, శివ, ఖాజమైనొద్దీన్, ఎండీ. రాజు, అహ్మద్, ఫారుక్, సమ్మద్, తిరుమలేశ్, చిన్న పాల్గొన్నారు.
చమురు ధరలు వెంటనే తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించి ప్రజలపై పడ్డ ఆర్థిక బారాన్ని తొలగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో బాగంగా గ్రంథాలయ ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ రమేశ్, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు టీ.వీ రాజు, శేఖర్రెడ్డి, కృష్ణ, పాండు, బాలరాజు, ఆంజనేయులు ఉన్నారు.