Rare Brain Infection | కేరళ (Kerala) రాష్ట్రంలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ (Rare Brain Infection) కేసు బయటపడింది. కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా (amoebae) కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు అలప్పుజా (Alappuzha) తీర ప్రాంతంలో నమోదైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అలప్పుజాలోని పానవల్లి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి అమీబా ఇన్ఫెక్షన్ సోకినట్లు చెప్పారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
కలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషి మెదడుకు ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు తెలిపారు. అంతకు ముందు 2017లో అలప్పుజ మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ వ్యాధి నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
‘‘ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’ (primary amoebic meningoencephalitis) అని పిలిచే ఈ వ్యాధి నీటిలో ఉండే అమీబా వర్గానికి చెందిన క్రిముల ద్వారా వ్యాపిస్తుంది. కాలువలు, కొలనుల్లో స్నానం చేసే సమయంలో ఈ పరాన్న జీవి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెదడువాపుకు కారణమవుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చ ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి’ అని వైద్యులు తెలిపారు. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కలుషిత నీటిలో స్నానాలు చేయవద్దని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు.
Also Read..
Krithi Shetty | స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి
Twitter Vs Threads | పోటీ మంచిదే.. మోసం కాదు.. థ్రెడ్స్పై దావా వేస్తాం: ట్విట్టర్
Tomato Price | రూ.160 దాటిన కిలో టమాట ధర.. గంగోత్రి ధామ్లో అయితే..