న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్గాంధీ హయాంలో 1989లోనే రాజ్యసభ ముందుకు వచ్చిందని, నాడు బీజేపీ నేతలు వ్యతిరేకించి ఉండకపోతే ఆ బిల్లుకు అప్పుడే ఆమోదముద్ర పడేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. నాడు లోక్సభ ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభలో బీజేపీ అడ్డుకుందని, బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, రామ్ జెఠ్మలానీ, జశ్వంత్ సింగ్ బిల్లును తీవ్రంగ వ్యతిరేకించారని పవన్ ఖేరా గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని, అందుకే ఆయనను తమకు స్టార్ క్యాంపెయినర్గా పరిగణిస్తున్నామని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. అయితే, ఈ మధ్య ఆయన కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకమంటూ మరో అబద్దపు ప్రచారం నెత్తికెత్తుకున్నారని, అందుకే తాను 1989 నాటి నిజాన్ని గుర్తు చేశానని ఖేరా చెప్పారు. ప్రధాని మోదీ అబద్దాలకోరు అని వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి సత్యాహరిశ్చంద్రుడి గురించి తరచూ మాట్లాడుతుంటాడని, కానీ సత్యాహరిశ్చంద్రుడు అసత్యాలు పలుకడని పవన్ ఖేరా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నోటి వెంట మాత్రం అబద్ధాలు తప్ప నిజాలు రావని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఒక సర్టిఫైడ్ లయర్ అని ఖేరా మండిపడ్డారు.
#WATCH | Delhi: Congress leader Pawan Khera says, “We consider PM Modi as our star campaigner… He keeps saying that Congress is against the Women’s Reservation Bill, but let me remind you that in 1989 when Rajiv Gandhi proposed this bill in Rajya Sabha, it was opposed by BJP… pic.twitter.com/V8zQqwLl99
— ANI (@ANI) September 26, 2023