Loksabha Elections 2024 : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత్లోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయులుగా, దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారని సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు.
పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓవైపు మీరు భారత్ జోడో యాత్ర చేసి ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతూనే మరోవైపు అరబ్బులు, చైనీయులు, ఆఫ్రికన్లు అంటూ జాతి వివక్ష, విభజిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ దక్షిణాది, ఉత్తరాది వాదనలను తెరపైకి తెస్తుండగా, విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఉత్తరాదిని, సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతం అంతా అసత్యాలు, విభజన వాదం, భారతీయులను విభజించి దేశాన్ని బలహీనపరచడమేనని, ఈ విషయం వారి వ్యాఖ్యల ద్వారా బహిర్గతమవుతోందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
AstraZeneca: మార్కెట్ల నుంచి కోవిడ్ టీకాను వెనక్కి రప్పిస్తున్న ఆస్ట్రాజెనికా