Rajasthan | కువైట్ (Kuwait)లో పనిచేస్తున్న భారత్కు చెందిన ఓ వ్యక్తి పాకిస్థాన్ మహిళ (Pakistani Woman)ను వివాహం చేసుకునేందుకు తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో చోటు చేసుకుంది. హనుమాన్గఢ్ (Hanumangarh) డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్ చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్గఢ్లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్కు పాకిస్థాన్కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు.
అనంతరం సౌదీ అరేబియాలో (Saudi Arabia) పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో రెహ్మాన్పై ఫరీదా బానో కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, త్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్ను హనుమాన్ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు.
Also Read..
Air India | లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ముంబైకి దారి మళ్లింపు
Arvind Kejriwal | కేజ్రీవాల్కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
Manish Sisodia | మళ్లీ డిప్యూటీ సీఎం పగ్గాలు..? మనీశ్ సిసోడియా సమాధానం ఇదే..!