రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారించకుండా అలాచేసే హక్కు ప్రధానికి కూడా లేదు. ప్రభుత్వాలే బుల్డోజర్లను నడిపితే రాజ్యాంగం ఎక్కడున్నట్టు? అంబేద్కర్ పాలన ఎక్కడున్నట్టు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రజలు ఉపేక్షించొద్దు.
-రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్