ముంబై: ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కొత్త బ్రిడ్జ్ను నిర్మించారు. గుజరాత్లోని ఔరంగా బ్రిడ్జ్(Auranga Bridge)కు చెందిన ఓ స్టన్నింగ్ ఫోటోను రైల్వేశాఖ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. వల్సాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిర్మించిన ఆ బ్రిడ్జ్ అద్భుతంగా ఉంది. ఆ బ్రిడ్జ్ను 2023 ఆగస్టులోనే నిర్మించారు. సాంకేతిక అద్భుతం.. ప్రకృతి సోయగం .. ఔరంగా బ్రిడ్జ్ భవిష్యత్తు ప్రయాణాలకు చిహ్నంగా నిలుస్తుందని రైల్వేశాఖ తన ట్వీట్లో కామెంట్ చేసింది. ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ పనులను 2021 నవంబర్లో స్టార్ట్ చేశారు. అయితే బుల్లెట్ రైలు ట్రాక్ కోసం ఆరు నదులపై బ్రిడ్జ్లను నిర్మించారు. పార్ అండ్ ఔరంగ, పూర్ణ, మిందోలా, అంబిక, వేన్గనియా నదులపై బ్రిడ్జ్లను కట్టారు. బుల్లెట్ రైలు రూట్లో మొత్తం 24 బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు. దాంట్లో 20 గుజరాత్లో ఉండగా, మహారాష్ట్రలో మిగితా బ్రిడ్జ్లు ఉన్నాయి.
Blending nature’s beauty with technological marvels
The Auranga Bridge in Valsad, Gujarat, paves the way for the future of travel with the #BulletTrain pic.twitter.com/jK6j63dnip
— Ministry of Railways (@RailMinIndia) January 23, 2024