Railways | ఉత్తర భారత దేశంలో (Northern India) గత కొన్ని రోజులుగా చలి వణికిస్తోంది (Cold Waves). ఈ కారణంగా ఢిల్లీ సహా పలు రాష్టాలపై మంచు దుప్పటి కప్పేసింది. దట్టమైన పొగ ఆవహించడంతో విజిబిలిటీ తక్కువగా ఉంటోంది. ఈ పొగమంచు (dense fog) విమాన, రైళ్ల రాకపోలకపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా రైల్వేకి (Railways ) భారీ నష్టం వాటిల్లింది. ఏకంగా రూ.1.22 కోట్ల మేర నష్టపోయింది.
మొరదాబాద్ డివిజన్లో గతేడాది డిసెంబర్లో 20 వేల రిజర్వేషన్ టికెట్ల రద్దు చేసినట్లు (tickets cancelled) డివిజనల్ (Moradabad Division) రైల్వే మేనేజర్ రాజ్కుమార్సింగ్ తెలిపారు. రిజర్వ్ చేసిన టికెట్లలో బరేలీలో 4,230, మొరదాబాద్లో 3,239, హరిద్వార్లో 3,917, డెహ్రాడూన్లో 2,448 టికెట్లు రద్దు చేసినట్లు తెలిపారు. చలిగాలుల ప్రభావంతో, పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను రద్దు చేసినట్లు సింగ్ పేర్కొన్నారు. మార్చి వరకు 42 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయని.. ఈ రద్దు కారణంగా తాము రూ.1.22 కోట్ల రూపాయలు తిరిగి ప్రయాణికులకు చెల్లించినట్లు ఆయన వివరించారు.
Also Read..
Pooja Hegde | ఫ్రెండ్ సంగీత్లో బుట్టబొమ్మ సందడి.. అరబిక్ కుత్తూ పాటకు స్టెప్పులేసిన పూజా హెగ్డే
Justin Trudeau | మరోసారి మొరాయించిన ట్రూడో అధికారిక విమానం.. నాలుగు నెలల్లో రెండోసారి
Heeralal Nagar | మంత్రిని సన్మానిస్తుండగా కూలిన వేదిక.. 40 మందికి గాయాలు