న్యూఢిల్లీ : మోదీ ఇంటి పేరు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఊరట లభించిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలను గాను పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేండ్ల జైలు శిక్షపై సర్వోన్వత న్యాయస్ధానం స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో ఊరట లభించిన నేపధ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా..నా కర్తవ్యం కొనసాగుతుంది..భారత్ను కాపాడే ఆలోచన అలాగే ఉంటుందని రాహుల్ ట్వీట్ చేశారు. ఈరోజు లేదా రేపు, ఎల్లుండి సత్యం ఎప్పటికీ నిలుస్తుందని విలేకరుల సమావేశంలో అన్నారు. నా బాట సుస్పష్టం..మాకు సాయపడిన వారి పట్ల మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతు అందిస్తున్త ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటా అన్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగిపోనుంది. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు కూడా లభించింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. బీజేపీ కుట్రపూరితంగా రాహుల్ గాంధీని అణిచివేయాలనుకున్న తీరు బట్టబయలైందని వ్యాఖ్యానించారు.
Read More :
Rahul Gandhi | రాహుల్కు ఊరట.. జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే, ఎంపీ హోదా పునరుద్ధరణ