తిరువనంతపురం : కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన సమయంలో చాలా ప్రతిఘటనను ఎదుర్కొన్నామని, బ్యూరోక్రాట్లు, వ్యాపారులు డబ్బు వృథా అవుతుందని అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘లోక్సభలో ఈజీఎస్కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు విని తాను షాక్కు గురయ్యాను. యూపీఏ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నంగా అభివర్ణించారు. ఇది ఖజానాపై భారం’ అని అన్నారన్నారు. ఈజీఎస్ పథకం ప్రధానికి అర్థం కాలేదని, దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు.