Bharat Jodo Nyay Yatra : లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా బరిలో దిగుతామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటనతో ఇండియా కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. విపక్ష కూటమిలో లుకలుకల నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్కు చేరుకుంది.
రాహుల్ యాత్ర అసోం నుంచి గురువారం ఉదయం బెంగాల్లోని కూచ్బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. మీ సమస్యలు విని మీకు సంఘీభావం తెలిపేందుకే ఇక్కడకు వచ్చానని, బెంగాల్కు రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్లు దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని హింస, అన్యాయం, అసమానతలు పెచ్చుమీరాయని చెప్పారు.
ఇక అసోం మీదుగా సాగిన భారత్ జోడో న్యాయ యాత్ర గోలక్గంజ్ మీదుగా కూచ్బెహర్ జిల్లాలో బెంగాల్లో ప్రవేశించింది. అసోంలోని గౌరిపూర్లో ఎస్యూవీలో చేరుకుని రాత్రి అక్కడే బస చేసి బస్లో గోలక్గంజ్ చేరుకున్నారు. జనవరి 14న మణిపూర్లో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.
Read More :
Salary | రెండు నెలలైనా రాని జీతాలు.. అవస్థలు పడుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు