Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘కుస్తీ’ (Wrestles) పోటీల్లో పాల్గొన్నారు. ఒలింపిక్ పతక విజేత, టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా (Bajrang Punia)తో పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ‘కుస్తీ’ పోటీల్లోని మెళకువలను రెజ్లర్లను అడిగి తెలుసుకున్నారు. రెజ్లర్ల రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.
కాగా, ఇటీవలే జరిగిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లతో రాహుల్ బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. హర్యాణాలోని (Haryana) ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్లో ఉన్న రెజ్లర్లను కలిసి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బజరంగ్ పునియా తమ సమస్యలను రాహుల్కు విన్నవించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్రెసిడెంట్గా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నిరసనగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు తమ అవార్డులను వాపస్ ఇచ్చేశారు. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజరంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారిని కలిసి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है।
आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की।
सवाल… pic.twitter.com/IeGOebvRl6
— Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023
Also Read..
Rahul Gandhi | భారత్ న్యాయ యాత్రకు సిద్ధమైన రాహుల్
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయం నిర్మాణానికి యాచకుల భారీ విరాళం
Unlimited Biryani | రూ.99కే అన్లిమిటెడ్ బిర్యానీ.. వేస్ట్ చేస్తే మాత్రం అంతే సంగతులు..!