న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలను రక్షించాలని సూచించారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకుపైగా పెరగడంతో ఆహార ధరలు 22శాతం పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందే రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపించాయన్నారు. రాబోయే రోజుల్లో పెరుగుతుందని అంచనాలున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా చైన్కు కొవిడ్ అంతరాయం కలిగించిందన్న ఆయన.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తక్షణం చర్యలు తీసుకొని ప్రజలను రక్షించాలని ట్వీట్ చేశారు.
గత శనివారం ద్రవ్యోల్బణం, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్లపై వడ్డీ రేటును తగ్గించడంపై కేంద్రంపై రాహుల్ ఫైర్ అయ్యారు. కేంద్రం తప్పుడు విధానాల పరిణామాలను సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎఫ్డీ 5.1శాతం, పీపీఎఫ్ 7.1శాతం, ఈపీఎఫ్ 8.1శాతం.. రిటైల్ ద్రవ్యోల్బణం 6.07శాతం తగ్గించారని, టోకు ద్రవ్యోల్బణం 13.11శాతం పెరిగిందని, ప్రజలకు ఉపశమనం కలిగించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అంటూ మండిపడ్డారు.