Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా ఆయన చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ (Bharat Jodo Nyay Yatra)కు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత నెల అస్సోంలోని గువాహటిలోకి రాహుల్ యాత్ర ప్రవేశించిన సమయంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ (Congress yatra clash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అస్సోం పోలీసులు (Assam Police) రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు.
కాగా, ఈ అంశంపై రాహుల్ గాంధీకి అస్సోం సీఐడీ (Criminal Investigation Department) త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో రాహుల్తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, జైరాం రమేశ్, శ్రీనివాస్ బీవీ, జితేంద్ర సింగ్, కన్హయ్య కుమార్, గౌరవ్ గొగొయ్, భూపేన్ కుమార్ బోరా, దేబబ్రత సైకియా పేర్లు ఉన్నాయి. అందులో పలువురు నేతలకు ఇప్పటికే సమన్లు జారీ అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సమన్లు అందిన వారు ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
Also Read..
Coaching Student | కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం
Smriti Irani: వయనాడ్ వదిలేయ్.. అమేథీలో పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
Rituraj Singh | చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి