న్యూఢిల్లీ : పదోతరగతి సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరెస్సెస్, బీజేపీల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మహిళల విముక్తి పిల్లలపై తల్లితండ్రుల ఆధిపత్యాన్ని నాశనం చేసిందని శనివారం నిర్వహించిన సీబీఎస్ఈ ఆంగ్ల పరీక్ష ప్రశ్నాపత్రంలో పొందుపరిచిన నేపధ్యంలో రాహుల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.
తన భర్త మార్గాన్ని అంగీకరించడం ద్వారానే తల్లి పిల్లలపై విధేయతను పొందగలదని మరో వాక్యంలో పొందుపరిచారు. చిన్నారులు కష్టపడి పైకి ఎదగాలని, మూఢవిశ్వాసాలు ఉపకరించవని రాహుల్ పిలుపు ఇచ్చారు. మరోవైపు సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంలో దొర్లిన వాక్యాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లింగ అసమానతలను, పురోగమన ఆలోచనలను ప్రేరేపించేలా ఉందని అభివర్ణించారు. మహిళలపై తిరోగమన ఉద్దేశాలను బీజేపీ విశ్వసించని పక్షంలో సీబీఎస్ఈ కరిక్యులంలో వీటిని ఎందుకు ప్రస్తావించారని ఆమె ప్రశ్నించారు.