దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్తున్నాయని విమర్శించారు. నిరుద్యోగిత, చమురు ఉత్పత్తులు, మత కల్లోలాల విషయంలో శ్రీలంక పరిస్థితి, భారత్ పరిస్థితి ఒకే రకంగా వుందని విమర్శించారు.
ప్రజల దృష్టిని మార్చినంత మాత్రాన వాస్తవాలను కనుమరుగు చేయలేరు. భారత ఆర్థిక వ్యవస్థ అచ్చు శ్రీలంక లాగే వుంది అంటూ గ్రాఫులతో సహా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇరు దేశాల్లో కూడా 2017 నుంచి నిరుద్యోగిత పెరిగిపోయిందని, 2020 నాటికి గరిష్ఠ స్థాయికి పెరిగిందని రాహుల్ ఈ గ్రాఫ్లో చూపించారు. ఇక పెట్రో ధరలను కూడా రాహుల్ గ్రాఫ్లో చూపించారు.
Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2022