Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రచారం క్లైమాక్స్కు చేరింది. బిహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఓ ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో 22 మందిని ప్రధాని మోదీ రాజులు, మహారాజులుగా చేశారని కానీ వారి పేర్లు మాత్రం వేరని అన్నారు.
వారిలో అదానీ, అంబానీల పేర్లున్నాయని వారి కోసం నరేంద్ర మోదీ 24 గంటలు కష్టపడతారని ఎద్దేవా చేశారు. బిలియనీర్లను బాగు చేసేందుకు ప్రధాని అహరహం శ్రమిస్తున్నారని ఆరోపించారు. పేదల సమస్యలు, ధరల మంట, నిరుద్యోగం గురించి కాషాయ పాలకులు పట్టించుకోరని విమర్శించారు.
దేశ సంపదను బడా సంపన్నులకు దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పెద్ద పెద్ద కధలు చెప్పడం మాని అసలు దేశంలో ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చారో ప్రధాని మోదీ బిహార్ యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యర్ధ ప్రసంగాలు, దేశ ప్రజల మధ్య చీలిక చిచ్చును నిలిపివేయాలని మోదీకి హితవు పలికారు.
Read More :
Group-1 | గ్రూప్-1 ప్రిలిమినరీ వాయిదా లేదు: టీఎస్పీఎస్సీ