Rahul Gandhi : దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహుల్ సహా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో కాంగ్రెస్ ఎంపీ అసోం సీఎంపై విరుచుకుపడ్డారు.
అసోం సీఎంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రిస్తున్నారని అన్నారు. అమిత్ షాకు వ్యతిరేకంగా ఆయన ఏమైనా మాట్లాడితే పార్టీ నుంచి మెడపట్టి గెంటేస్తారని అన్నారు. కాగా, జోడో న్యాయ్ యాత్రను బర్పెట నుంచి రాహుల్ తిరిగి ప్రారంభించారు. కాగా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీస్ సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు’ అని బిశ్వశర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Read More :
Auranga Bridge: బుల్లెట్ రైలు కోసం కొత్త బ్రిడ్జ్.. అద్భుతమైన పిక్ షేర్ చేసిన రైల్వేశాఖ