Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పేదల ముఖాల్లో వెలుగులు పూసేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే దేశంలో పేదల జాబితాను రూపొందిస్తామని, ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళ పేరును ఎంపకి చేస్తామని చెప్పారు. జులై 5న దేశంలోని పేద మహిళలందరి బ్యాంక్ ఖాతాల్లో రూ. 8,500 జమ చేస్తామని అన్నారు.
జులై నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా ప్రతి నెలా వారి ఖాతాల్లో వేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. పేద మహిళల ఖాతాల్లో నగదు జమ చేయగానే మీడియా ప్రశ్నలు లేవనెత్తితే ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని తాము చెబుతామని అన్నారు.
Read More :
Rahul Gandhi | కేన్స్లో సత్తా చాటిన భారతీయ మహిళలు.. ప్రశంసలు కురిపించిన రాహుల్ గాంధీ