Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) త్వరలో కొత్త ఇంటికి మారబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ (Nizamuddin East) బీ2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్కు షిఫ్ట్ అవ్వాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
మోదీ ఇంటిపేరుకు సంబంధించిన కేసులో రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. మార్చిలో ఎంపీగా తనపై అనర్హత వేటు పడటంతో ఏప్రిల్ 22న రాహుల్ గాంధీ అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఇక అప్పటి నుంచి రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నివాసంలోనే ఉంటున్నారు. నాటి నుంచి ఇంటి కోసం వెతుకుతున్న రాహుల్.. ఇకపై నిజాముద్దీన్ ఈస్ట్లోని ఇంటికి మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాహుల్ మారబోయే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (Sheila Dixit) కు చెందినది. ఆ ఇంటిని మాజీ సీఎం 1991 లో కొనుగోలు చేశారు. అయితే, సీఎం, గవర్నర్ గా పని చేసిన సమయంలో ప్రభుత్వ అధికారిక నివాసాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ఫ్లాట్ కి తిరిగి వచ్చేశారు. చనిపోయే దాకా అదే ఫ్లాట్ లో నివసించారు. 2019 జులై 20న షీలా దీక్షిత్ మరణించిన విషయం తెలిసిందే.
Also Read..
Kashmira Shah | సల్మాన్ సలహాతోనే తల్లినయ్యా : బాలీవుడ్ నటి
Heavy Rains | ఉత్తరాదిలో వరుణుడి బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Aircraft | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్ వేపై దొర్లిన విమానం.. వీడియో