హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ ధరిస్తే, తాము కాషాయ శాలువాలతో వస్తామని హిందూ విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. దీంతో వివాదం మరింత రాజుకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కాబోయే పౌరుల జీవితాలతో కాలేజీలు చెలగాటమాడుతున్నాయి అంటూ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాహుల్ ట్వీట్ చేస్తూ… హిజబ్ అన్న దానితో విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నారు. సరస్వతీ దేవికి ఎలాంటి భేదాలూ వుండవు. జ్ఞానాన్ని అందరికీ సమానంగానే పంచుతుంది అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.