loksabha elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 82 మంది మహిళలు. అమేథీ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ, రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, లక్నో నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు.