చండీగఢ్: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి విజయ్ విజయ్ సింగ్లా చేతిలో 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మంత్రి అయిన విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు.
కాగా, సింగర్ సిద్ధూ మూసే వాలా ఆప్ను విమర్శిస్తూ గత నెలలో ‘బలిపశువు’ పేరుతో ఒక పాటను విడుదల చేశారు. ఆప్ మద్దతుదారులను ద్రోహులుగా అందులో ఆరోపించారు. మరోవైపు సింగర్ సిద్ధూ మూసే వాలాతో సహా 424 మంది వ్యక్తుల భద్రతను పంజాబ్ ప్రభుత్వం శనివారం ఉపసంహరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు గన్స్తో కాల్పులు జరిపారు. తీవ్ర బులెట్ గాయాలైన సిద్ధూ మూసేవాలాను ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఆయన ఇద్దరు స్నేహితులు కూడా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు.
#WATCH | Punjabi singer Sidhu Moose Wala was shot by unknown people in Mansa district, Punjab. Further details awaited. pic.twitter.com/suuKT20hEj
— ANI (@ANI) May 29, 2022