Bhagwant Mann : ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆప్ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టగా పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ బలాలను ప్రదర్శించాల్సిన సమయం కాదని, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా గట్టి సందేశం పంపాల్సిన సందర్భమని స్పష్టం చేశారు.
ఈరోజు మనం మనకు స్వేచ్ఛను ప్రసాదించిన భగత్ సింగ్ గ్రామంలో ఉన్నామని, కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని భగవంత్ మాన్ అన్నారు. మనకు బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అందించగా రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలక కాషాయ సర్కార్ ప్రతిపక్షాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
మనం నిజాయితీతో పారదర్శకంగా రాజకీయాలు చేస్తామని తెలిసిన బీజేపీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ అరెస్ట్ చేయించిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలకులు మనల్ని చూసి భయపడ్డారని వ్యాఖ్యానించారు. భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్లో భగత్ సింగ్కు భగవంత్ మాన్ నివాళులు అర్పించారు.
Read More :
Premalu OTT | ఓటీటీలోకి తెలుగు ‘ప్రేమలు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?