Pune Car Crash : పుణేలో మద్యం మత్తులో మైనర్ విలాసవంతమైన పోర్షే కారును నిర్లక్ష్యంగా నడిపిన ఘటనలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు మరణించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు.
మైనర్కు మద్యం సరఫరా చేయడంతో పుణేలో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఘోర ప్రమాదం వాటిల్లిందని అన్నారు. డ్రగ్స్ స్వాధీనం, మైనర్లకు మద్యం సరఫరాలు, డ్రంకెన్ డ్రైవ్ జరుగుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చడంలో నిమగ్నమైందని విమర్శించారు. పుణే ఘటనకు బాధ్యులు ఎవరని ఏక్నాథ్ షిండే సర్కార్ను ఆమె ప్రశ్నించారు.
Read More :