Bangalore | డ్రగ్స్, గ్రావెల్ వంటి మాఫియా గ్యాంగ్ల గురించి ఇప్పటి వరకు మనం విని ఉంటాం. అయితే బెంగళూరు (Bangalore)లో మరో కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా (Puncture Mafia). ఈ మాఫియా ప్రస్తుతం అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చీటికి మాటికి వాహనాలు పంక్చర్ అవుతుండటంతో ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా అశోకనగర ప్రాంతంలో వాహనాలు తరచూ పంక్చర్ అవుతున్నాయి. పంక్చర్ షాపులు దగ్గర్లో ఉన్న చోటు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలోని రోడ్లపై మేకులు కుప్పలుతెప్పలుగా కనిపిస్తుండటంతో ఇది పంక్చర్ మాఫియా పనేనని పోలీసులు (Police) అనుమానిస్తున్నారు.
నగరంలోని కొందరు పంక్చర్ షాప్ వ్యక్తులు.. తమ దుకాణానికి ఒక కిలోమీటర్ దూరంలో రోడ్లపై, కూడళ్ల వద్ద మేకులు (nails on road), ఇతర పదునైన వస్తువులను పడేస్తారు. అవి గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్ అవుతాయి. ఫలితంగా పమీపంలోని షాపుల్లో పంక్చర్ చేయించుకునేందుకు వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ విధానంతో కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
అనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్ తదిరత ప్రాంతాల్లో పోలీసులు తరచూ కిలోకుపైగా మేకులు, ఇనుప తీగలను సేకరిస్తున్నారు. రహదారులు, దత్తపీఠానికి వెళ్లే మార్గంలోనే మేకులు వేసే మాఫియా ఉందని వారు గుర్తించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఈ మాఫియా ఆట కట్టించగలమని అశోకనగర ఠాణా ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ అభిప్రాయపడ్డారు.
Also Read..
MS Dhoni | ధోనీ మరో ఘనత.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా రికార్డు
Rahul Gandhi | ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
Parenting Tips | మూడేండ్ల బాబు ఎంత తినిపించినా తినట్లేదు? ఏం చేయాలి?