పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు ప్రవేశపెట్టారు. పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ తీర్మానానికి పుదుచ్చేరి ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో సీఎం ఎన్ రంగస్వామి స్పందిస్తూ.. ఈ తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టినట్టుగా గుర్తించాలని స్పీకర్ను కోరారు. స్పీకర్ అంగీకరించడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.