న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ శాఖల్లో సేవలందించి, కానిస్టిట్యూషనల్ కండక్ట్ పేరుతో ఒక వేదికగా ఏర్పడిన 89 మంది మాజీ ఉద్యోగులు సంతకం చేసిన ఈ లేఖలో పలు అంంశాలను ప్రస్తావించారు. దేశంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రధాన ఆటంకాలుగా ఉన్న ధనబలం, అధికార బలం, మీడియా, ఓటర్ల నమోదు, ఈవీఎంల నిర్వహణకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని ఈసీకి సూచించారు.