Priyanka Gandhi : ప్రజా సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాలకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. అసోంలోని ధుబ్రిలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు.
కాషాయ పాలకులు ప్రజల ఇబ్బందులు పట్టించుకోరని, ఇవాళ నిరుద్యోగం అత్యధికంగా ఉందని, యువత ఉద్యోగాలు లేక తీవ్ర సమస్యలతో సతమతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించని మోదీ సర్కార్ సమాజంలో విభజన చిచ్చు రేపుతోందని మండిపడ్డారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
Read More :
Lok Sabha polling | అనంత్నాగ్-రాజౌరీ పోలింగ్ వాయిదా