Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రచారం కోసం తాను ఏ ప్రాంతానికి వెళ్లినా పార్టీకి ప్రజల నుంచి మెరుగైన స్పందన లభిస్తోందని చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ పంజాబ్లోని పటియాలో పర్యటించారు. ప్రియాంక ఆదివారం పటియాలలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ప్రజలు బ్రహ్మరధం పడుతుండటం తాను గమనించానని, బీజేపీ పాలన పట్ల విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు నిజాయితీతో పనిచేయాలని కోరుకుంటున్నారనే విషయం ప్రజలు అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఇక ఎస్పీ-కాంగ్రెస్తో కూడిన విపక్ష ఇండియా కూటమి విజయం కోసం పాకిస్తాన్లో ప్రార్ధనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
. సరిహద్దు వెలుపల నుంచి విపక్ష కూటమికి జీహాదీలు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అంతకుముందు యూపీలోని బన్స్గావ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్పీ-కాంగ్రెస్ ఓటు జీహాద్కు పిలుపు ఇస్తున్నాయని అన్నారు.
పక్కా గృహాలు పొందనున్న 3 కోట్ల మంది పేదలు, రూ. 5 లక్షల వరకూ ఉచిత చికిత్స అందుకునే వృద్ధులు, ముద్ర పధకంతో రుణాలు పొందే కోట్లాది యువత, స్వయం ఉపాధి గ్రూపులకు చెందిన 3 కోట్ల మంది మహిళలు జూన్ 4న వెల్లడయ్యే తీర్పు కోసం వేచిచూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
Read More :
KTR | పౌర సరఫరా శాఖలో భారీ స్కాం.. బీజేపీ పాత్ర కూడా ఉందని అనుమానాలు వస్తున్నాయి : కేటీఆర్