Priyanka Gandhi : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన మెగా ర్యాలీలో విపక్ష నేతలు మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేపడుతోందని ఆరోపించారు.
ఇక ఇండియా విపక్ష కూటమి ప్రధానంగా ఐదు డిమాండ్లను లేవనెత్తుతోందని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈసీ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు విపక్ష నేతలపై బలవంతంగా చేపట్టిన చర్యలను ఈసీ నిలువరించాలని డిమాండ్ చేశారు.
హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని, విపక్షాలను ఆర్ధికంగా నిర్వీర్యం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ సేకరించిన నిధులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
Read More :