లోక్సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్కు చేరింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎవరిపై కేసులు పెట్టిందో వారి నుండి బీజేపీ విరాళాలు తీసుకుని వారి కేసులను తాత్కాలికంగా నిలిపివేసిందని అన్నారు.
కేసులు మోపబడిన వారి నుంచి డొనేషన్స్ తీసుకుని ఆయా కేసులను పెండింగ్లో పెట్టడం ద్వారా కాషాయ పార్టీ ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీగా అవతరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 55 ఏండ్ల పాటు అధికారంలో ఉన్నా ఈ 55 ఏండ్లలో తమ పార్టీ ఎన్నడూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా ఎదగలేదని గుర్తుచేశారు.
అసలు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేయలేదని అన్నారు. దేశ సంపద దేశ ప్రజల చేతుల్లోకి మళ్లించేందుకు తాము చర్యలు చేపడతామని చెప్పారు. తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు తాము సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తామని హామీ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
Read More :
IRS Officer | డేటింగ్ యాప్లో పరిచయం.. ఐఆర్ఎస్ అధికారి ఫ్లాట్లో మహిళ మృతదేహం