Priyanka Gandhi : ప్రధాని నరేంద్ర మోదీ చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజలను పట్టిపీడిస్తున్న సమ స్యలపై గొంతెత్తాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశంలో తూర్పు ప్రాంత ప్రజలు చైనీయులుగా, దక్షిణాది వారు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా ప్రియాంక గాంధీ స్పందిస్తూ మోదీ వ్యవహార శైలిని తప్పుపట్టారు.
మోదీ ఇలాంటి పనికిమాలిన అంశాలపై విరుచుకుపడే బదులు నిరుద్యోగం, ధరల మంట, మహిళలపై వేధింపుల వంటి అంశాలను తలకెత్తుకోవాలని ప్రియాంక గాంధీ సవాల్ విసిరారు. ఇక అంబానీ-అదానీ విమర్శలను రాహుల్ గాంధీ నిలిపివేశారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాయ్బరేలిలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ స్పందించారు.
గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ చాలా వివరణలు ఇస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ తన సోదరుడిని షెహజాద అని పిలుస్తున్నారని కానీ అతడు షెహన్షా అని ప్రియాంక పేర్కొన్నారు. యావత్ దేశ ఆస్తులను ప్రధాని కొందరు బిలియనీర్లకు కట్టబెట్టడం దేశం యావత్తూ చూస్తున్న క్రమంలో ప్రధాని వివరణలు ఇవ్వాల్సిన పరిస్ధితి నెలకొందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Read More :
EVM | ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్.. కేసు నమోదు