EVM | మహారాష్ట్ర : మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో నిన్న పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఖడక్వాసలా పోలింగ్ కేంద్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ ఈవీఎంకు హారతి ఇచ్చారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకురాలు కూడా పాల్గొన్నారు. ఈ హారతికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్పై సింహగడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
రూపాలి చకంకర్పై మాజీ జర్నలిస్ట్ రష్మీ పురాణిక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజున పూజ చేయాలని ఏమైనా కొత్త నిబంధన తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. పూజా సమయంలో గంటలు మోగించడానికి, అగర్బత్తులు వెలిగించడానికి ఎన్నికలు అధికారులు ఉన్నారా? అని అడిగారు.
బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బరిలో ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,561 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
अब नेता लोग वोट करने से पहले मतदान कक्ष की पूजा कर रहे हैं! क्या तुम जिंदा हो @ECISVEEP ? क्या यह नियमों का उल्लंघन नहीं है? मोदी का परिवार बन चुके चुनाव आयोग क्या कोई कारवाई करेगा? दुनिया में चुनाव आयोग की निष्पक्षता का डंका बजना चाहिए! pic.twitter.com/rWAtF11YK6
— sohit mishra (@sohitmishra99) May 7, 2024