UP Polls : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ అధిష్ఠానంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఛరిష్మాను తగ్గించడానికి బీజేపీ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. యోగి అత్యున్నత స్థాయికి ఎదుగుతారన్న భయంతోనే ఆయన్ను గోరఖ్పూర్ నుంచి బరిలోకి దించుతున్నారని అన్నారు. అయితే అయోధ్య నుంచి బరిలోకి దింపాలని అనుకున్నారని, అయితే చివరికి గోరఖ్పూర్ నుంచే బరిలోకి దించుతున్నారని, ఆయన ఛరిష్మాను తగ్గించడానికే ఇలా చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు.
యూపీని తాము తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లామనడం అర్థం పర్థంలేని విమర్శ అని, అభివృద్ధి పథంలోనే యూపీ ఎన్నికలు వెళ్లాలని ప్రియాంక డిమాండ్ చేశారు. మహిళలు సమస్యలను తీర్చడానికి ఇదే సరైన సమయమని, మహిళలు కూడా ఇప్పుడే ఓ పంతం పట్టాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు ఓట్ల సమీకరణ వైపు దృష్టి పెట్టాయని, వాటికి ప్రత్యామ్నాయాన్ని యూపీ ప్రజలు ఎన్నుకోవాలని ప్రియాంక కోరారు.