న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ కొన్ని కాలపరిమితులుగల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది.
తాజా రేట్ల మా ర్పుతో 390 రోజుల నుంచి రెండేండ్లలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై గరిష్ఠంగా 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం అందుతుంది.