PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కేరళ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
#WATCH | Kerala: Prime Minister Narendra Modi visits the landslide-affected area in Wayanad. He is being briefed about the evacuation efforts.
Governor Arif Mohammed Khan and Union Minister Suresh Gopi are also present.
(Source: DD News) pic.twitter.com/rANSwzCcVz
— ANI (@ANI) August 10, 2024
ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి వయనాడ్ చేరుకున్నారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపితో కలిసి కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (aerial survey) చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
Kerala | PM Narendra Modi undertook an aerial survey in Wayanad before physically visiting the location of the disaster.
In the aerial survey, he saw the origin of the landslide, which is in the origin of Iruvazhinji Puzha (River). He also observed the worst affected areas of… pic.twitter.com/bGGSbIbbZ6
— ANI (@ANI) August 10, 2024
కాగా, వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పీఎం మోదీ పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమన్నారు. ఇప్పటికైన వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Also Read..
Cisco Layoffs | AI ఎఫెక్ట్.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!