న్యూఢిల్లీ: కల్లోలిత మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
2023 మే నెల నుంచి జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్ అట్టుడికిపోయింది. దీంతో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (Biren Singh) తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2027తో ముగియనున్నది. ఇక్కడ గత 21 నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు, హింస కారణంగా దాదాపు 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
President’s rule in Manipur has been extended for a period of six months, effective from August 13, 2025. pic.twitter.com/KK2QKk4F6F
— ANI (@ANI) July 25, 2025