నారాయణపేట టౌన్, ఏప్రి ల్ 20 : సస్యరక్షణ చర్యలు పా టించడం వల్ల చీడపీడలను ని వారించవచ్చని ఆయిల్ పాం ఏరియా మేనేజర్ ప్రవీణ్రెడ్డి అ న్నారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం నుంచి మంగళవా రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయిల్ పాం సాగుపై ఏవోలు, ఏఈవోలు, హెచ్వోఎస్లకు శిక్ష ణ అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుకు ఎర్ర, నల్ల, నీరు నిలవని నేలలు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ తోటల్లో అంతర పంటలుగా అరటి, పపయా, కూరగాయలు, వేరుశనగ తదితర పంటలను వేసుకోవచ్చన్నారు. జి ల్లాలో 1,750 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చే యాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఆస క్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయిల్ పాం సాగుకు అవసరమైన నే ల రకాలు, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, మొక్కల ఎంపిక, నర్సరీల్లో తీసుకోవా ల్సి జాగ్రత్తలు, విత్తన ఎంపికలో పాటించాల్సిన అంశాలపై వివరించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ఆయిల్ ఫెడ్ టెక్నికల్ మేనేజర్ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.