న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధాని సలహా మేరకు వీరి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించినట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే ప్రధాని సూచన మేరకు గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాకు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖను.. ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్కు జల శక్తి శాఖను, మంత్రి శోభా కరంద్లాజేకు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖను, భారతీ ప్రవీణ్ పవార్కు గిరిజన వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించినట్టు పేర్కొన్నది.