వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడం లేదు. నిజమే.. కొన్ని రోజులుగా ఆయన వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వార్తలు తెగ ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. మంగళవారం మాత్రం కాంగ్రెస్ బాంబు పేల్చింది. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడం లేదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రకటించారు. దీంతో ఈ విషయానికి తెర పడినట్లైంది.
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో చర్చోపచర్చలు చేశాం. కాంగ్రెస్ పునరుత్థాణంపై ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. దీని తర్వాత సోనియా గాంధీ సాధికారత బృందం-2024ను ఏర్పాటు చేశారు. పార్టీలో చేరి, ఈ బృందంలో బాధ్యతలు నిర్వర్తించాలని సోనియా గాంధీ ఆయనను కోరారు. అందుకు ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు అని రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
ఇక.. దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్లో చేరాలని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చారని, అయితే దానిని తాను తిరస్కరించినట్లు పీకే ట్విట్టర్లో పేర్కొన్నారు. తన కంటే పార్టీకి సమిష్టి నాయకత్వం అవసరమని తాను భావిస్తున్నానని, అలా పార్టీ సంస్థాగతంగా పటిష్టం కావాలన్నదే తన అభిమతమని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
"Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined…," Randeep Surjewala, Congress pic.twitter.com/n2QYgT37NP
— ANI (@ANI) April 26, 2022