చెన్నై: తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డాడు. ప్రజాతీర్పును గౌరవించి వెంటనే విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ను ప్రకాశ్ రాజ్ కోరారు. గవర్నర్ వ్యవహారశైలి అనుచితమని, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. మనలో మత బేధాలు ఉండొచ్చుగానీ, విజయ్కు ప్రజా మద్దతు ఉందని, అతనికి అసెంబ్లీలో బలా న్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
గవర్నర్ ఇల్లు నిజాలు తేల్చుకునే వేదిక కాదని అన్నారు. దీనిని సభలోనే తేల్చుకోవాలని అన్నారు. దీనిని గవర్నర్ అడ్డుకోవడం సరికాదన్నారు. అతనికి సభలో బలాబలాలు నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ కోరారు. ఇలా చేయడం ప్రజాస్వామ్య బద్దం కాదని, ఇది అన్యాయమని ఆరోపించారు.