Power Outage | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఎండలు తగ్గుముఖంపట్టి వాతావరణం చల్లబడినప్పటికీ.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కోతలు మాత్రం ఆగట్లేదు. ఈ జూలైలోనూ పవర్ కట్స్ ఎదుర్కొంటున్నట్టు 74 శాతం మంది స్థానికులు చెబుతున్నారు. రోజుకు మూడు కంటే ఎక్కువసార్లు విద్యుత్తు కోతలను ఎదుర్కొంటున్నట్టు 55 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్రంలోని 51 జిల్లాల్లోని 8 వేల మందిని ప్రశ్నించిన ‘లోకల్ సర్కిల్స్’ ఓ నివేదికలో వెల్లడించింది.
రోజూ విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నవారు-74%
రోజుకు 1-2 సార్లు కోతలు ఎదుర్కొంటున్నవారు-19%
రోజుకు 3-5 సార్లు కోతలు ఎదుర్కొంటున్నవారు-19% రోజుకు 6-10 సార్లు కోతలను ఎదుర్కొంటున్నవారు- 30 %
రోజుకు 20 కంటే ఎక్కువసార్లు కోతలు ఎదుర్కొనేవారు-6 %