Polling : అస్సాం (Assam), కేరళ (Kerala) ల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల (Polling centers) దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 296 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది. కేరళలోఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నది. పుదుచ్చేరిలో ఎన్డీఏ, డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. అస్సాంలోని 126 నియోజకవర్గాలకు 31,490 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో నిలిచారు. కేరళలోని 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు 1,099 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 9 గంటల వరకు కేరళలో 16.23 శాతం, అస్సాంలో 17.87 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లను తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు.