న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య రాజకీయ సంఘర్షణల్లో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణాధికారాల వంటి రాజ్యాంగ సమస్యలపైనే జోక్యం చేసుకొంటామని తేల్చి చెప్పింది. ఢిల్లీ సర్కారు మంత్రుల ఫోన్లకు అధికారులు స్పందించటం లేదని, లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా పాలనను పట్టాలు తప్పేలా చేస్తున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఎల్జీ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం.. రాజకీయ సంఘర్షణలు అనేవి ప్రజాస్వామ్యంలో భాగమేనని, అలాంటివాటి నుంచి తాము వెనక్కి తగ్గుతున్నట్టు పేర్కొన్నది.